Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 బోగీలు - నలుగురి మృతి

వరుణ్
గురువారం, 18 జులై 2024 (17:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ప్రమాద తెలియగానే సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. అలాగే ప్రమాద వివరాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధింత రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పగా, వీటిలో రెండు ఏసీ బోగీలు కూడా ఉన్నాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను ప్రకటించింది. 
 
- Commercial Control: 9957555984
- Furkating (FKG): 9957555966
- Mariani (MXN): 6001882410
- Simalguri (SLGR): 8789543798
- Tinsukia (NTSK): 9957555959
- Dibrugarh (DBRG): 9957555960 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments