Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 బోగీలు - నలుగురి మృతి

వరుణ్
గురువారం, 18 జులై 2024 (17:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ప్రమాద తెలియగానే సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. అలాగే ప్రమాద వివరాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధింత రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పగా, వీటిలో రెండు ఏసీ బోగీలు కూడా ఉన్నాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను ప్రకటించింది. 
 
- Commercial Control: 9957555984
- Furkating (FKG): 9957555966
- Mariani (MXN): 6001882410
- Simalguri (SLGR): 8789543798
- Tinsukia (NTSK): 9957555959
- Dibrugarh (DBRG): 9957555960 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments