Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ సోకిన రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి (2) అనే చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో గత నెలలో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం ఆమె చనిపోయింది. 
 
అయితే, ఆమెలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు శాంపిల్స్‌న పూణెలోని వైరాలజీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఆస్పత్రికి చేరింది. ఈ పరీక్షల్లో జ్యోతికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి అనేక కోళ్లు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments