Webdunia - Bharat's app for daily news and videos

Install App

27నుంచి తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:35 IST)
తిరుపతి- ఆదిలాబాదు, కాకినాడపోర్టు- రేణిగుంట మధ్య ఈనెల 27నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

తిరుపతిలో ఈ ప్రత్యేకరైలు (07405) ఉదయం 5.50 గంటలకు బయల్దేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, వరంగల్‌, ఖాజీపేట, సికింద్రాబాదు మీదుగా ఆదిలాబాదుకు మరుసటి రోజు ఉదయం చేరుకుంటుందన్నారు.

అలాగే ఈ రైలు (07406) రాత్రి 9.05గంటలు ఆదిలాబాదులో బయల్దేరి వెళ్లిన మార్గంలోనే మరుసటిరోజు ఉదయం తిరుపతి చేరుకుంటుందన్నారు.

కాకినాడ పోర్టు నుంచి మరో ప్రత్యేకరైలు (07249) మధ్యాహ్నం 2.50గంటలకు బయల్దేరి విజయవాడ, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటి రోజు చేరుకుంటుందన్నారు.

అనంతరం ఈ రైలు (07250) రాత్రి 10.30గంటలకు తిరుపతిలో బయల్దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం కాకినాడపోర్టుకు చేరుకుంటుందన్నారు. ఈ రెండు రైళ్లు రోజూ నడుస్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments