Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:41 IST)
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ఘోర ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. గుంటూరులోని శావల్యాపురం మండలంలోని బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
 
కనకమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారును ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకు చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 
మరో ఐదుగురు తీవ్ర గాయాలయ్యారు. గాయపడ్డ వారందరినీ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments