Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెలూన్లు కొనేందుకు వెళ్లిన మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మణుగూరుకు చెందిన 14 యేళ్ళ బాలిక పట్టణంలోని ఓ షాపు వద్దకు బెలూన్లు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఆ బాలికను గుర్తించిన ముగ్గురు యువకులు తమ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
అపుడు ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆ కామాంధులు భయపడి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం చుట్టుపక్కల వారు ఆ యువతిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ సమయంలో హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం