Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెలూన్లు కొనేందుకు వెళ్లిన మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మణుగూరుకు చెందిన 14 యేళ్ళ బాలిక పట్టణంలోని ఓ షాపు వద్దకు బెలూన్లు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఆ బాలికను గుర్తించిన ముగ్గురు యువకులు తమ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
అపుడు ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆ కామాంధులు భయపడి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం చుట్టుపక్కల వారు ఆ యువతిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ సమయంలో హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం