Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో తుడిసిపెట్టుకున్న తెలుగుదేశం.. లోక్‌సభ ఎన్నికల పోటీకి దూరం

Advertiesment
TDP
తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిసిపెట్టుకుని పోతుందని చెప్పొచ్చు. వచ్చే నెల 11వ తేదీన జరుగనున్న లోక్స‌సభ ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా... ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
కాగా, గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయినప్పటికీ తెరాస విజయభేరీని అడ్డుకోలేక పోయాయి. పైగా, ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారు కూడా అధికార తెరాసలో చేరిపోయారు. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇపుడు లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించడంతో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ పుణ్యమాని రైతుపంట పండింది... ఎలా?