Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరితల ద్రోణి ప్రభావం... ఏపీలో మరో రెండు రోజుల వర్షాలు...

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుంది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 
 
తూర్పు విదర్భ నుంచి దక్షి కోస్తాంధ్ర వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. సముద్రమట్టానికి ఇది 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
పలు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పారు. వర్ష సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని తెలిపారు. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. 
 
మరోవైపు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. పెద్దపవ్వూరులో 15 సెంటీమీటర్లు, ధర్మవరంలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments