Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు సర్వీసులు

passport
, ఆదివారం, 28 ఆగస్టు 2022 (11:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై శనివారాల్లో కూడా పాస్‌పోర్టు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై మరింత వేగంగా పాస్‌పోర్టు పొందే అవకాశం ఉంది. తొలి దశలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లోని కార్యాలయాలు కూడా శనివారాల్లో పనిచేస్తాయి.  
 
ప్రస్తుతం ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. సెప్టెంబరు మూడో తేదీ నుంచి శనివారాల్లో కూడా పని చేయనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. విదేశాలకు వెళ్లందుకు పాస్‍‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశీలనకు మూడు వారాల సమయం పడుతుంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్ దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించి, శనివారం కూడా ఈ కేంద్రాలు పని చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారని తెలిపారు. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని టోలీచౌకి, బేగంపేట, అమీర్‌పేట, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రాలు ప్రతి శనివారం తెరుచుకుంటాయని దాసరి బాలయ్య వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవు?