Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మీద కోపంతో బిడ్డను చంపిన తల్లి...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (16:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం జిరగింది. భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డను ఓ తల్లి ఇటుకతో కొట్టి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. కానీ, ఇటుక కొట్టిన దెబ్బలు తాళలేక ఇద్దరు పిల్లలు కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు రావడంతో ఆ తల్లి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దపల్లి జిల్లాలోని దావరిఖని, సప్తగిరి కాలనీలో రమాదేవి అనే మహిళ భర్తతో కలిసి నివశిస్తోంది. వీరికి  అజయ్, ఆర్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మాత్రం ఎన్టీపీసీలో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భర్త విధులకు వెళ్లాడు. అయితే, భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
 
దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత గ్యాస్‌ లీక్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments