Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (09:00 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. గతంలో కరోనా వైరస్ కారణంగా.. భక్తులను అనుమతించలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తక్కువ కావడంతో భక్తులను అనుమతినిస్తున్నారు. అయితే.. కొన్ని నిబంధనల మధ్య భక్తులను శ్రీ వారి దర్శనానికి అనుమతినిస్తున్నారు.
 
మరోవైపు.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 2021, జూన్ 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున టీటీడీ విడుదల చేయనుంది.
 
వైద్య పరీక్షలు నిర్వహించాకే దర్శనానికి అనుమతినిస్తారు. మాస్క్ ధరించాలి..భౌతిక దూరం తప్పనిసరి. కంటైన్ మెంట్ జోన్ల భక్తులకు, 65 ఏళ్లు పైబడిన వారికి.. పిల్లలకు అనుమతినివ్వరు. రెండు గంటలకొకసారి క్యూ లైన్లలో శానిటైజేషన్ నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు వుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments