Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గదుల అద్దె భారీగా పెంచేశారు...

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (11:39 IST)
ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుమలలో తితిదే ఆధ్వర్యంలో ఉన్న వివిధ సముదాయాల గదుల అద్దెను భారీగా పెంచేశారు. ఇప్పటివరకు ఉన్న అద్దెను ఇపుడు రెట్టింపు చేశారు. దీంతో గదుల ద్వారా వచ్చే కలెక్షన్ కూడా రెట్టింపు అయింది. 
 
తిరుమలలో వివిధ సముదాయాల్లోని 952 వసతి గదుల ఉన్నాయి. పాంచజన్యంలో 383, కౌస్తుభంలో 229, నందకంలో 340 గదులు  ఉండగా, ఒక్కో గదికి నందకంలో రూ.600, పాంచజన్యం, కౌస్తుభంలలో రూ.500 చొప్పున అద్దె వసూలు చేసేవారు. 
 
అయితే, గదుల నిర్వహణ ఖర్చులు పెరగడంతో అద్దె కూడా పెంచాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం తితిదే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు మూడు సముదాయ భవనాల్లో ఉన్న గదులకు ఒక్కొక్క దానికి ఒక్క రోజుకు అద్దెను రూ.1000కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే పాత ధరలతో రోజుకు రూ.5,09,500 వసూలయ్యే మొత్తం గురువారం నుంచి రూ.9.51 లక్షలకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments