Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గదుల అద్దె భారీగా పెంచేశారు...

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (11:39 IST)
ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుమలలో తితిదే ఆధ్వర్యంలో ఉన్న వివిధ సముదాయాల గదుల అద్దెను భారీగా పెంచేశారు. ఇప్పటివరకు ఉన్న అద్దెను ఇపుడు రెట్టింపు చేశారు. దీంతో గదుల ద్వారా వచ్చే కలెక్షన్ కూడా రెట్టింపు అయింది. 
 
తిరుమలలో వివిధ సముదాయాల్లోని 952 వసతి గదుల ఉన్నాయి. పాంచజన్యంలో 383, కౌస్తుభంలో 229, నందకంలో 340 గదులు  ఉండగా, ఒక్కో గదికి నందకంలో రూ.600, పాంచజన్యం, కౌస్తుభంలలో రూ.500 చొప్పున అద్దె వసూలు చేసేవారు. 
 
అయితే, గదుల నిర్వహణ ఖర్చులు పెరగడంతో అద్దె కూడా పెంచాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం తితిదే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు మూడు సముదాయ భవనాల్లో ఉన్న గదులకు ఒక్కొక్క దానికి ఒక్క రోజుకు అద్దెను రూ.1000కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే పాత ధరలతో రోజుకు రూ.5,09,500 వసూలయ్యే మొత్తం గురువారం నుంచి రూ.9.51 లక్షలకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments