Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటన్నర వ్యవధిలోనే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం : ఈవో ధర్మారెడ్డి

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (09:32 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే సర్వదర్శన భక్తులకు కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించినట్టు చెప్పారు. 
 
ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ, సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. అదేసమయంలో శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని చెప్పారు. 
 
తిరుమల కొండవై దళారీ వ్యవస్థను నిరోధించడం ద్వారా రూ.215 కోట్లు శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా స్వామివారికి చేరుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్ళలో రూ.1500 కోట్ల విరాళాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. 
 
తిరుమలలో 7500 గదులకు 40 యేళ్లుగా మరమ్మతులు చేయలేదని, కానీ కరోనా కాలంలో 4500 గదులకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. వచ్చే సెప్టెంబరు నాటికి మిగిలిన గదులకు కూడా మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments