Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొడ్డిదారిన పదవులు దక్కించుకోలేదు... నా సొంత డబ్బులే ఖర్చు చేస్తా : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
బుధవారం, 17 జులై 2019 (17:43 IST)
మాజీ మంత్రి నారా లోకేశ్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాను దొడ్డిదారిన పదవిలోకి రాలేదన్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోనని, అవసరమైతే తన డబ్బే ఖర్చు చేస్తానంటూ ప్రకటించారు. 
 
అమరావతిలో తితిదే ఛైర్మన్‌కు క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, దేవుడు సొమ్మును స్వాహా చేయబోతున్నారంటూ విమర్శించారు. 
 
దీనికి వైబీ సుబ్బారెడ్డి స్పందించారు. 'ఈ అబ్బాకొడుకులు ఇద్దరూ రాష్ట్రమంతా దోచి పారేశారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోను. అవసరమైతే నా జేబు నుంచి ఖర్చు చేస్తాను. మేము ఏమీ వాళ్లలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి, మేము పదేళ్లు కష్టపడ్డాం.
 
ప్రజలకు మేలు చేయాలని వచ్చాం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేవుడి సొమ్ము స్వాహా కాదు.. ఒక్క రూపాయి సొమ్మును వృథా కూడా కానివ్వబోం. నా ప్రయాణాలకు కూడా స్వామివారి సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడను. అక్కసుతో బాధపడుతున్న ప్రతిపక్షాలన్నింటికి ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నా' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments