Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించిన టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:53 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు  దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మ‌న్ గా తిరిగి ప‌ద‌వి పొందిన సుబ్బారెడ్డి తొలిసారిగా అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు.

దుర్గ గుడిలో ఆయ‌న‌కు ఆలయ మర్యాదల‌తో స్వాగతం పలికారు. వేద పండితులు  ఆశీర్వచనాలు అందించారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం, చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతుల‌కు అందజేశారు.
 
టీటీడీ ఛైర్మ‌న్  వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.

ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర‌ ప్రజలపై ఉండాలని కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల‌న్నీ సకాలంలో ప్రజలకు చేరాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని, కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్న‌ట్లు సుబ్బారెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments