Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం.. ఏంటది? (Video)

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (17:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (తితిదే బోర్డు) సంచలన నిర్ణయం తీసుకుని, భక్తులకు శుభవార్త చెప్పింది. సామాన్య భక్తులకు కేవలం రెండు మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం చేయించేలా ఇకపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే, తితిదేలో పని చేస్తున్న ఇతర మతాలకు చెందిన వారికి వీఆర్ఎస్ ఇవ్వడం లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. 
 
తితిదే కొత్త పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింద. ఇందులో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీచేసింది. సామాన్య భక్తులకు రెండు లేదా మూడు గంటల్లో దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేసింది. కంపార్టుమెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరతిగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. తితిదే పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ లేదా ప్రభుత్వం శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. 
 
డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని తిరిగి తితిదేకు అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటాన్న నిషేధించారు. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
అన్నదాన ప్రసాదంలో కొత్తగా మరో ఐటమ్‌ వడ్డించాలని నిర్ణయించారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని, శారదా పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేసి, శారదా పీఠం నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పర్యాటక శాఖకు కేటాయిస్తున్న నాలుగు వేల ఎస్ఈడీ టిక్కెట్లను రద్దు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments