Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (09:21 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఓ మంచి నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని కొండపై పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకిరానుంది. ఇదే అంశంపై భక్తులకు కూడా తితిదే ఓ విన్నపం చేసింది. 
 
నేటి నుంచి తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌కు పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిషేధం బుధవారం నుంచి కఠినంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. 
 
మరోవైపు, కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని ప్రకటించిన తితిదే అందుకు తగినట్టుగానే నిఘా పెట్టింది. అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్టు తెలిపింది. అలాగే కొండపై వ్యాపారాలు చేసేవారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments