Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేకేఎన్‌పీపీ వ్యవస్థాపకుడు భీంసింగ్ ఇకలేరు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:57 IST)
జమ్మూకాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూశారు. ఈయనకు 81 సంవత్సరాలు. ఆయన గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని జీఎంసీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన ఒక రచయితగా, మానవహక్కుల నేతగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సీనియర్ కార్యవర్గ సభ్యుడుగా సుపరిచితుడు. 
 
కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భీంసింగ్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1982లో జమ్మూకాశ్మీర్‌ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్, క్యూబా విప్లవ కెరటం ఫిడెల్ కాస్ట్రో, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీతో భీంసింగ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కాగా, ఈయన భార్య, కుమారుడు ఉన్నారు. వీరు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments