Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేకేఎన్‌పీపీ వ్యవస్థాపకుడు భీంసింగ్ ఇకలేరు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:57 IST)
జమ్మూకాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూశారు. ఈయనకు 81 సంవత్సరాలు. ఆయన గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని జీఎంసీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన ఒక రచయితగా, మానవహక్కుల నేతగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సీనియర్ కార్యవర్గ సభ్యుడుగా సుపరిచితుడు. 
 
కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భీంసింగ్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1982లో జమ్మూకాశ్మీర్‌ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్, క్యూబా విప్లవ కెరటం ఫిడెల్ కాస్ట్రో, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీతో భీంసింగ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కాగా, ఈయన భార్య, కుమారుడు ఉన్నారు. వీరు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments