Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా, ఆ టిటిడి వసతి సముదాయాలన్నీ కరోనా బాధితుల కోసమే

Webdunia
బుధవారం, 15 జులై 2020 (22:00 IST)
కరోనా విజృంభిస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకే కరోనా సోకడం.. 91 మందికి అధికారికంగా కరోనా సోకినట్లు స్వయంగా టిటిడి ప్రకటించడం.. ఇక స్థానికుల్లో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుండటం ఇదంతా భక్తులను ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవాలి.
 
తిరుపతి లాంటి ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం టిటిడి కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసేసుకుంది. భక్తుల కోసం కట్టిన వసతి సముదాయాలను ఏకంగా కరోనా బాధితులకు అందిస్తోంది. ఇప్పటికే టిటిడి ఉద్యోగస్తుల కోసం శ్రీనివాసం, మాధవం లాంటి వసతి గృహాలను కేటాయిస్తే తాజాగా బర్డ్ ఆసుపత్రిని కోవిడ్ బాధితులకు అందించేందుకు సిద్ధమైంది టిటిడి.
 
అంతేకాకుండా విష్ణునివాసంలోని 400 పడకలను కూడా కోవిడ్ బాధితులకే వినియోగించనున్నారు. కలెక్టర్ కోరిక మేరకు టిటిడి వసతి సముదాయాలను కోవిడ్ బాధితులకే అందించేస్తున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలన్నీ ప్రభుత్వానికి అందించనున్నారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు కోవిడ్ బాధితులకు ఉపయోగిస్తుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments