Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:57 IST)
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని ఈఆర్సీ పేర్కొంది.

ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్‌కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. రెండు నెలల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేశాయి.
 
పత్రికా ప్రకటన ఇవ్వకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ట్రూ అప్ చార్జీల వసూళ్లపై వినియోగదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో పిటిషన్లు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

ట్రూ అప్ చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది. కాగా దసరా సెలవులు అనంతరం దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments