Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరితెగించిన తెరాస ఎమ్మెల్యే... టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బరితెగించిపోతున్నారు. నిన్నటికి మొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రెచ్చిపోయాడు. నిన్న మంత్రి చందూలాల్ కుమారుడు వీరంగం సృష్టించాడు.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బరితెగించిపోతున్నారు. నిన్నటికి మొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రెచ్చిపోయాడు. నిన్న మంత్రి చందూలాల్ కుమారుడు వీరంగం సృష్టించాడు. నేడు మహిళా ఎమ్మెల్యే తన పవరేంటో చూపించింది. దీంతో తెలంగాణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 
 
తాజాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడిగ శోభ, ఆమె అనుచరగణం రేణిగుంట గ్రామం వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ఎమ్మెల్యేతో పాటు ఆమె అనుచరులు ప్రయత్నించారు. 
 
దీంతో టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుపడటంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరిస్తున్న కొందరి మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారు. ఈ వ్యవహారం కలకలం రేపింది. 
 
ఈ మధ్యకాలంలో తెరాస ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్న విషయం తెల్సిందే. వీరి వ్యవహారశైలిపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారమవుతున్నా తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం నోరుమెదపక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments