Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు.

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...
, శుక్రవారం, 24 నవంబరు 2017 (21:24 IST)
ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు. 
 
బాంబు దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మరికొందరిపై ఉగ్రవాదులు తుపాకులతో వెంటాడి వెంటాడి చంపారు. ఈ తుపాకుల దాడిలో మరో 55 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా తీవ్రంగా గాయపడినవారు 100 మందికి పైగా వున్నట్లు చెపుతున్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులగా భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత