తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. కవిత.. నేడు నామినేషన్

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (11:31 IST)
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పేరు ఖరారైంది. ఆమె అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆమె బుధవారమే నామినేషన్ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
నిజామాబాద్ ఎంపీగా అయిదేళ్ల పాటు పనిచేసిన ఆమె అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కేడర్‌ను వెన్నంటి నడిపించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కీలకమైన పదవిలో ఆమెకు అవకాశం ఉంటుందని జిల్లా నేతలు భావిస్తుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన ఎమ్మెల్సీ పదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది.
 
రెండు జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడం వల్ల ఉభయ జిల్లాల్లో పట్టు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రి, స్పీకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మాజీ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 80 శాతంకు పైగా టీఆర్‌ఎస్‌ ఓటర్లే ఉండడం వల్ల గెలుపు కూడా సునాయసంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments