Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ లో ప్రత్యేక పరీక్ష ద్వారా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:59 IST)
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి డా సురేష్ స్పష్టం చేశారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి డా. సురేష్ వివరించారు. 

ఈ మేరకు ట్రిపుల్ ఐటీల యాజమాన్యం తీర్మానం చేశాయని చెప్పారు. అయితే అందుకోసం చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో వంద మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు.

ప్రత్యేక పద్దతిలో ఓఎంఆర్ ఆధారితంగా ఆఫ్లైన్లో నిర్వహించే ఈ ప్రవేశపరీక్షలో మ్యాథ్స్కకు 50, సైన్స్ కు50 మార్కులు ఉంటాయని చెప్పారు. పదో తరగతి సిలబస్ ఆధారంగాఉండే ఈ పరీక్ష కోసం ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని, తెలంగాణలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ)లో ఏటా పదో తరగతి ఫలితాల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేసిన విషయం తెలిసిందేనని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments