Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో జారిపడిన నన్నపనేని రాజకుమారి, తలకు గాయం

ఇంట్లో జారిపడిన నన్నపనేని రాజకుమారి, తలకు గాయం
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (21:46 IST)
టీడీపీ మహిళా నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ప్రమాదానికి గురయ్యారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆమె తన ఇంట్లో జారి పడటంతో తలకు గాయమైంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
 
ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారు. గాయం తీవ్రత తక్కువేనని తెలుస్తోంది. నన్నపనేని జారి పడ్డారన్న విషయం తెలియగానే టీడీపీ నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆమె క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
నన్నపనేని రాజకుమారి కొంతకాలం కిందట ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి తెనాలిలో తమ స్వగృహంలో ఉంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కోతిని కనిపెట్టి ఇచ్చేవాళ్లకు రూ.50వేల రివార్డు.. అక్టోబర్‌ 7కి కేసు వాయిదా