Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వైకాపా నేత రాజీనామా.. జిల్లా అధ్యక్ష పదవికి కాపు గుడ్‌బై

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వేడి మెల్లగా రాజుకుంటుంది. అదేసమయంలో అధికార వైకాపాలో ముసలం చెలరేగుతుంది. ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ నేతల్లో ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన పలువురు వైకాపా నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. 
 
ఇటీవలే గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవికి మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా చేశారు. ఇపుడు అదే బాటలో మరో నేత నడిచారు. అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. ఇందులో తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. 
 
ఇటీవల కాపు రామచంద్రారెడ్డి కుమార్తె భర్త, తన అల్లుడు మంజునాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి గట్టెక్కేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం తనకు కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. 
 
పైగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంపై దృష్టిసారించాల్సి అవసరం ఎంతైనా ఉన్నందున పార్టీ అధ్యక్ష బాధ్యతలను తాను పర్యవేక్షించలేని, ఆ పదవిని మరో వ్యక్తికి ఇవ్వాలని కాపు రామచంద్రారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments