Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓసి నీ తెలివి తగలెయ్య... జ్యూడీషియల్ రిమాండ్ తప్పించుకునేందుకు...

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (11:21 IST)
విశాఖపట్టణం జిల్లాలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం కేసులో జ్యూడీషియల్ రిమాండ్‌ను తప్పించుకునేందుకు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మధుప్రియ అనారోగ్య నాటకానికి తెరలేపింది. ఈ కేసులో సినీ నిర్మాత నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ కేసు నమోదు చేశారు. దీంతో నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. 
 
అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు భార్య మధుప్రియ జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యం నాటకం ఆడారు. దీంతో పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు చెప్పడంతో ఆమె నాటకం బయటపడింది.
 
శిరోముండనం కేసులో మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండడంతో దాని నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం నాటకం ఆడారు. 
 
కాగా, ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ ఇంట్లో పనిమానేసిన కర్రి శ్రీకాంత్ అనే యువకుడిని మధుప్రియ ఇంటికి పిలిపించి శిరోముండనం చేయించడం రాష్ట్రంలో సంచలనమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments