Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో గుండు చేసిన దృశ్యం, నూతన్ నాయుడు భార్యపై బిగుస్తున్న ఉచ్చు?

Advertiesment
Shaved scene
, శనివారం, 29 ఆగస్టు 2020 (16:17 IST)
దళితుడిని ఇంటికి పిలిపించి శిరోముండనం(గుండు) చేసిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంట్లోని సిసి టివి ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అందులో పనివాళ్ళతో పాటు నూతన్ నాయుడు భార్య దగ్గరుండి మరీ శిరోముండనం చేయిస్తున్న విజువల్స్ బయటడ్డాయి. 
 
ఈ విషయాన్ని విశాఖ పోలీసు కమిషనర్ మీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. సెక్షన్ 307, 342, 324, 323, 506r/w34ipc 3(1)b ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
 
ఎ వన్ ముద్దాయిగా నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, జాన్సీ, సౌజన్య, బాలు, రవిలపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాంత్ కేసు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్తే నన్ను ప్రశ్నించలేదు, నువ్వెవడిరా నన్నడగటానికి? ప్రియుడితో వాగ్వాదం