Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా మంట - కేజీపై రూ.50 పెరుగుదల

Webdunia
సోమవారం, 2 మే 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, టమోటా ధర విపరీతంగా పెరిగిపోయింది. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్‌లో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా వుంది. అయితే, ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. 
 
తమ వద్ద కేజీ టమోటాలను రూ.10కి కొనుగోలు చేసే వ్యాపారులు ఇపుడు తమ వద్ద పంట లేకపోవడంతో ఒక సిండికేట్‌గా ఏర్పడి కిలో రూ.60కి అమ్ముతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. 
 
అటు మదనపల్లి మార్కెట్‌సో కూడా టమోటా ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం నాణ్యమైన టమోటా రూ.30 నుంచి రూ.35 పలికింది. ఇపుడు రంజాన్ పండుగ సమీపించడంతో ఈ ధర రూ.55 నుంచి రూ.60కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments