Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ లంచ్ మీటింగ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య లంచ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడ తాడేపల్లికి వర్మ బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వర్మ.. సీఎంతో సమావేశమయ్యారు. 
 
గతంలో సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయిన దాఖలాలు లేవు. ఇపుడు ఉన్నట్టుండి రాంగోపాల్ వర్మ ఆకస్మికంగా విజయవాడకు వచ్చి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య తాజాగా రాజకీయ, సినీ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments