Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ లంచ్ మీటింగ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య లంచ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడ తాడేపల్లికి వర్మ బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వర్మ.. సీఎంతో సమావేశమయ్యారు. 
 
గతంలో సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయిన దాఖలాలు లేవు. ఇపుడు ఉన్నట్టుండి రాంగోపాల్ వర్మ ఆకస్మికంగా విజయవాడకు వచ్చి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య తాజాగా రాజకీయ, సినీ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments