Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (09:38 IST)
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నెల 23న హైకోర్టు తీర్పును వెలువరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు న్యాయస్థానం ఆదేశిస్తే ఏర్పాట్లను వెంటనే చేసేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు.

గుంటూరు జిల్లాలో 8 జడ్పీటీసీ స్థానాలు, 226 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీమయ్యాయి. మిగిలిన 46 జడ్పీటీసీ స్థానాలు, 579 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఎన్నికల నిర్వహణకు మంగళవారం తీర్పు ఇస్తే వెంటనే పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలని పీఆర్‌ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను మౌఖికంగా ఆదేశించారు.

దీంతో జడ్పీ సీఈవో చైతన్య, ఎంపీడీవోలు, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గతేడాది నోటిఫికేషన్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే 6 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పుపై అటు రాజకీయనేతల్లో ఇటు అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments