Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్!?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:07 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ శాఖను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను నియమించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన్ను ఏపీ శాఖ అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశం ఉంది.
 
మరోవైపు, బీఆర్ఎస్‌లో మరికొంతమంది ఏపీ నేతలు సోమవారం చేరనున్నారు. వీరిలో చంద్రశేఖర్‌తో పాటు ఐఆర్టీఎస్ మాజీ అధికారి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టేజీ ప్రకాష్‌తో పాటు పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వీరంతా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 
 
ఆ తర్వాత ఏపీ పగ్గాలను తోట చంద్రశేఖర్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 యేళ్లపాటు పని చేసిన ఈయన గత 2009లో పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైకాపా అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నుంచి 2019లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments