Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానుజ సహస్రాబ్ది వేడుకల కోసం నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళతారు. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌ శ్రీరామ నగరులో ఉన్న శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకుంటారు. 
 
ఇక్కడ జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన సమతామూర్తి విగ్రహంతో పాటు ఇక్కడ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను సందర్శించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయన రాత్రి 8 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి రాత్రి 9.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వస్తారు. 
 
అలాగే, ఈ నెల 11వ తేదీన కూడా సీఎం జగన్ మరోమారు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహానికి ఆయన హాజరవుతారు. సీఎం పర్యటనలకు  సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments