Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వుండగానే రెండో పెళ్లి.. ఆపై వేధింపులు.. హత్యాయత్నం.. చివరికి?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:15 IST)
భార్య వుండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య వుందనే విషయం చెప్పకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో రెండో భార్య నిలదీసింది. దీంతో ఆ భర్త రెండో భార్యను వేధించడం మొదలెట్టాడు. ఓ దశలో ఆమెను వదిలించుకునేందుకు మేడపై నుంచి తోసి హత్య చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంటలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంటకు చెందిన కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. 2012లో భర్తతో విబేధాలు వచ్చి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఎల్ఎస్ నగర్‌లో ఉండేది. అదే బిల్డింగ్‌లో రాజేష్ అనే బ్యాంక్ ఉద్యోగి ఉండేవాడు. కృష్ణవేణి పరిస్థితి తెలుసుకుని పరిచయం పెంచుకున్నాడు. తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు నమ్మించాడు. 
 
కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. గత ఏడాది పెళ్లికూడా చేసుకున్నాడు. కొన్ని నెలల కాపురం తర్వాత రాజేష్‌లో అసలు మనిషి బయటపడ్డాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని కృష్ణవేణి తెలుసుకుంది.
 
ఇదే విషయమై రాజేష్‌ను నిలదీయడంతో వివాదమైంది. అంతేగాకుండా తనను వదిలించుకునేందుకు రాజేష్ ప్రయత్నించాడని కృష్ణవేణి ఆరోపించింది. నిద్రలో ఉన్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందపడేశాడని తెలిపింది. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments