Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:59 IST)
ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలోని ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూతపడింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రాకపోకలు నిలిపివేశారు. 
 
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శ్రీవారి ఆలయం. ఇక ఆకలి అన్నవారికి కడుపునిండా అన్నం పెట్టే సత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం భక్తుల ఆకలి తీర్చడమే కాదు భక్తులు ఆరోగ్యం కోసం కూడా ఎన్నో ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు టీటీడీ సిద్ధమౌతోంది. 
 
తాజాగా దేశాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దావఖాన, ఎస్వి ఫార్మసీలు సంయుక్తంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం ఐదు రకాల ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వసంతకుమార్ వెల్లడించారు. 
 
ఈ ఆయుర్వేద మందులు టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే ఈ మందులను విడతలవారీగా పంపిణీ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments