Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:59 IST)
ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలోని ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూతపడింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రాకపోకలు నిలిపివేశారు. 
 
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శ్రీవారి ఆలయం. ఇక ఆకలి అన్నవారికి కడుపునిండా అన్నం పెట్టే సత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం భక్తుల ఆకలి తీర్చడమే కాదు భక్తులు ఆరోగ్యం కోసం కూడా ఎన్నో ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు టీటీడీ సిద్ధమౌతోంది. 
 
తాజాగా దేశాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దావఖాన, ఎస్వి ఫార్మసీలు సంయుక్తంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం ఐదు రకాల ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వసంతకుమార్ వెల్లడించారు. 
 
ఈ ఆయుర్వేద మందులు టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే ఈ మందులను విడతలవారీగా పంపిణీ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments