Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆభరణాలపై బాబు ఆవిధంగా ముందుకు పోతున్నారు...

శ్రీవారి ఆభరణాలను రెండేళ్లకోసారి జ్యుడీషియల్ విచారణ ద్వారా తనిఖీ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాను ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన నిర్ణయమే. అయితే ఇప్పుడు అటువంటి విచారణ జరిపిస్తారా లేదా అనేది మాత్రం సిఎం చెప్పలేదు. వేల కోట్ల విలువైన శ్రీవారి ఆభరణాలపై

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (14:22 IST)
శ్రీవారి ఆభరణాలను రెండేళ్లకోసారి జ్యుడీషియల్ విచారణ ద్వారా తనిఖీ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాను ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన నిర్ణయమే. అయితే ఇప్పుడు అటువంటి విచారణ జరిపిస్తారా లేదా అనేది మాత్రం సిఎం చెప్పలేదు. వేల కోట్ల విలువైన శ్రీవారి ఆభరణాలపై రమణ దీక్షితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు. కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ గల్లంతయిందన్న అనుమానాలనూ ఆయన వ్యక్తం చేస్తున్నారు. రమణ దీక్షితులు ఆరోపణలను కొట్టిపారేస్తున్న ప్రభుత్వం విచారణకు ససేమిరా అంటోంది. 
 
ఎప్పుడో వాద్వా, జగన్నథరావు కమిటీలు విచారణ చేశాయని, ఇక విచారణే అవసరం లేదని వాదిస్తూ వచ్చింది. ఆకస్మికంగా చంద్రబాబే స్వయంగా రెండేళ్లకు ఒకసారి ఆభరణాపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. తద్వారా భక్తుల్లో విశ్వాసం పాదుగొల్పుతామని అన్నారు. వాస్తవంగా రమణ దీక్షితులు కోరుతున్నదీ ఇదే. ఎప్పడో చేయించిన విచారణ కాదని, మళ్లీ ఇప్పుడు ఒకసారి ఆ పని చేయాలని అంటున్నారు. పంతానికి పోయిన టిటిడి, ప్రభుత్వం రమణ దీక్షితులుపై దాడి చేయడం మినహా విచారణ చేయిస్తామని మాత్రం చెప్పలేదు. ఆయన కోరినట్లు సిబిఐతో కాకున్నా సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ జరిపించి వుండాల్సింది. 
 
కానీ ఈ అంశాన్ని సానుకూల కోణంలో చూడటం కంటే రాజకీయ దృక్పథంతో చూస్తూ ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. దీక్షితులుపై ఎదురుదాడి వల్ల భక్తుల్లో నమ్మకం కల్పించలేకపోగా అనుమానాలు బలపడటానికి ప్రభుత్వమే కారణమయింది. అదే విధంగా బ్రాహ్మణ సామాజికవర్గంలో టిడిపి పట్ల వ్యతిరేకత పెరగడానికి దోహదపడింది. ఈ నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన చంద్రబాబు రెండేళ్లకొకసారి నగల తనిఖీ చేస్తామని ప్రకటించారు. ఇందులో ఇంకో అంశం కూడా ఉంది. టిటిడిపై ఎంపి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో కేసు వేస్తున్నారు. కోర్టు జోక్యంతో శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాల్సిన అనివార్యత ఏర్పడినా ఏర్పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా విచారణను వ్యతిరేకిస్తున్న వారికి బాబు ప్రకటనతో జ్ఞానోదయం అవుతుందని అనుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిట్లు జ్యుడీషియల్ విచారణ ఈ ఏడాదితోనే మొదలుపెట్టడం సమంజసంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments