తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు కుదింపు, కారణమేంటంటే?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:29 IST)
తిరుమల శ్రీవారి దర్సన టోకెన్లు దొరకడం సాధారణంగా కష్టంతో కూడుకున్న పని. భారీ రెకమెండేషన్లు, విఐపిల లెటర్లు ఇలా తెగ హడావిడి చేస్తే తప్ప స్వామివారి దర్సన భాగ్యం దొరికే పరిస్థితి. దర్సనం దొరికిందంటే ఇక ఆ భక్తుడికి పెద్ద పండుగే. ఇదంతా ఎప్పటిదీ.... కరోనాకు ముందు మాట.
 
అలాగే సర్వదర్సనం టోకెన్లను టిటిడి గతంలో అందిస్తూ వచ్చింది. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే భక్తులు స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవారు. అయితే సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 
 
ఆన్ లైన్లో ఇప్పటి వరకు టిటిడి 15 వేల టోకెన్ల వరకు భక్తులకు ఇస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్సనాలను భారీగా కుదించింది టిటిడి. ప్రత్యేక ప్రవేశ దర్సన టిక్కెట్లను 5 వేలకు తగ్గించింది. టిక్కెట్ల సంఖ్యను కుదించడంతో తిరుమలలో భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గనుంది. ఇప్పటికే సర్వదర్సన టోకెన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments