Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్డి కులస్తులను అవమానిస్తున్నారు.. ఆర్ఆర్ఆర్‌పై ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:21 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రెడ్డి కులస్తులను కించ పరిచేలా, అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
 
నిజానికి తనను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ దారుణమైన రీతిలో వ్యవహరించిందంటూ ఎన్‌హెచ్ఆర్సీకి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేరారు. ఎన్‌‍హెచ్‌‍ఆర్సీ ఛైర్మన్ పీసీ పంత్‌ను కలిసిన రఘురామ తన అరెస్టు నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. 
 
ఈ క్రమంలో ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి .. రఘురామరాజుపై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించేలా రఘురామరాజు వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
రఘురామ వ్యాఖ్యల తాలూకు వీడియోలను కూడా కరుణాకర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు అందజేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments