Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు_భర్త ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:39 IST)
భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామకృష్ణ చైతన్య అనే వ్యక్తి వయసు 44 సంవత్సరాలు. ప్రైవేట్ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమలగిరిలోని చంద్రగిరి కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
 
ఇతనికి రజని వైష్ణవితో ప్రేమ వివాహం జరిగింది.. వీరికి 14 సంవత్సరాల వయస్సుగల కూతురు ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 10 వ తేదీన భార్య మ్యూచువల్ డైవోర్సు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
 
కోర్టు ద్వారా దాన్ని తను తీసుకుని సంతకం పెట్టి పంపించడం జరిగింది. దానితో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఒంటరిగా ఇంట్లో ఉండి, మద్యం సేవించి నిన్నటి అర్ధరాత్రి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకుని చనిపోయాడు.
 
ఉదయం 11 గంటలకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అపార్ట్మెంట్ వాసులు బలవంతంగా డోరు తెరిచి చూడగా చైతన్య అప్పటికే చనిపోయి ఉన్నాడు.. అతని మేనత్త శ్రీమతి కీత రాధ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గాంధీ మార్చురీకి  తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments