Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు_భర్త ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:39 IST)
భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామకృష్ణ చైతన్య అనే వ్యక్తి వయసు 44 సంవత్సరాలు. ప్రైవేట్ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమలగిరిలోని చంద్రగిరి కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
 
ఇతనికి రజని వైష్ణవితో ప్రేమ వివాహం జరిగింది.. వీరికి 14 సంవత్సరాల వయస్సుగల కూతురు ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 10 వ తేదీన భార్య మ్యూచువల్ డైవోర్సు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
 
కోర్టు ద్వారా దాన్ని తను తీసుకుని సంతకం పెట్టి పంపించడం జరిగింది. దానితో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఒంటరిగా ఇంట్లో ఉండి, మద్యం సేవించి నిన్నటి అర్ధరాత్రి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకుని చనిపోయాడు.
 
ఉదయం 11 గంటలకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అపార్ట్మెంట్ వాసులు బలవంతంగా డోరు తెరిచి చూడగా చైతన్య అప్పటికే చనిపోయి ఉన్నాడు.. అతని మేనత్త శ్రీమతి కీత రాధ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గాంధీ మార్చురీకి  తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments