Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయింది.. బాలుడి మృతి

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:24 IST)
మొన్నటికి మొన్న సపోటా పండు ప్రాణాలపైకి వచ్చిన వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ చిన్నారిని గోళి బలి తీసుకుంది. సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోచమ్మ వీధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోరుట్ల రవిరాజు మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. శనివారం కొడుకు అభియంత్(11 నెలలు) ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సీసపు గోళి మింగేశాడు. 
 
అది గొంతులో ఇరుక్కుపోయింది. ఇంకా ఊపిరాడలేదు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జగిత్యాల తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments