Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొడుకు జులాయి.. మందలించిన తండ్రి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

కొడుకు జులాయి.. మందలించిన తండ్రి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:05 IST)
కొడుకు తీరుపై విసిగిపోయిన తల్లి మనస్తాపానికి గురైంది. అంతే మేడమీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటవ మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాటికొండ గ్రామం, చిత్రపురం కాలనీలో నివాసం వుంటున్న పేటా పెంటయ్య, మౌనిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
పెంటయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కుమారుడు మాత్రం జులాయిగా తిరుగుతూ కాలం గడిపాడు. ఈ వ్యవహారంపై కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడంపై మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొంది. 
 
నిత్యం ఈ వ్యవహారాన్ని కళ్లారాజూస్తున్న తల్లి మనస్తాపానికి లోనైంది. కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో వైకాపా ఎమ్మెల్యే కారుపై రాళ్ళదాడి