Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వ్యాపార సంస్థల‌ స‌మ‌యం కుదింపు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:23 IST)
కరోనా ఉధృతి దృష్ట్యా నగరంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేప‌ధ్యంలో ఈ నెల 28 నుంచి వ్యాపార సంస్థలన్నీ మధ్యాహ్నం 2గంటల వరకే నిర్వహించాలని విజయవాడ చాంబర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు విజ్ఞప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా సోమవారం గాంధీనగర్  ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు (షాపులు) పూర్తిగా తెరచి ఉంచి వ్యాపారం నిర్వహించుట శ్రేయస్కరం కాదన్నారు.

ప్రజల, వ్యాపారస్తులు, వివిధ సంఘాలు, ముఠా కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులు స్వియ నియంత్రణతో ఖచ్చితంగా షాపులు 2 గంటల వరకూ మాత్రమే తెరచి వుంచి వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు.

కరోనా వలన మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అందుచేత‌ వ్యాపారులు కరోనా నిబంధనలు తప్పక పాటించి నిర్ణీత సమయం వరకు మాత్రమే వ్యాపారాల‌ను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్సి పి.యస్.ఎల్.ఎన్.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments