Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి ఇంట్లో కరోనా కలకలం : ముగ్గురికి పాజిటివ్.. మంత్రికి?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (09:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. ఆ మంత్రి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఫలితంగా మంత్రితోపాటు మంత్రి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. వైరస్ నిర్ధారణ అయిన ముగ్గురు రోగులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మాలగుండ్ల శంకర్ నారాయణ కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన.. బీసీ సంక్షేమ శాఖామంత్రిగా జగన్ మంత్రివర్గంలో విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఇటీవల మంత్రి అత్త అనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. వైద్యులు ఎందుకైనా మంచిదని భావించి, మంత్రి కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా, ముగ్గురు పాజిటివ్ అని తేలింది. అయితే, అదృష్టవశాత్తు మంత్రి శంకర్ నారాయణకు మాత్రం నెగెటివ్ అని తేలింది. దీంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. 
 
అలాగే, మంత్రి కుటుంబ సభ్యులు నివసించే ధర్మవరంలోని సాయి నగర్‌ను కంటైన్మెంట్ జోనుగా అధికారులు ప్రకటించి, కఠినమైన ఆంక్షలను కొనసాగిస్తున్నారు. అలాగే, ఈ ప్రాంతాన్ని శానిటైజ్, క్లోరినేషన్ చేయాల్సిందిగా స్థానిక యంత్రాంగాన్ని అధికారులు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments