Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరాఖండ్‌లో మంత్రిగారి భార్యకు కరోనా... సిబ్బందికి క్వారంటైన్

ఉత్తరాఖండ్‌లో మంత్రిగారి భార్యకు కరోనా... సిబ్బందికి క్వారంటైన్
, ఆదివారం, 31 మే 2020 (16:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మంత్రివర్యుని అర్థాంగికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ మంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కు పంపించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా సత్యపాల్ మహారాజ్ ఉన్నారు. అయితే, నిత్యం ప్రజా సేవలో ఉండే మంత్రికి ఈ కరోనా వైరస్ సోకకుండా ఆయన అమృతా రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 
దాంతో మంత్రిని, ఇతర సిబ్బందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారి నుంచి నమూనాలు తీసుకుని వైద్య పరీక్షలు చేయనున్నారు. అమృతా రావత్ గతంలో మంత్రిగా వ్యవహరించారు. ఆమె కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో రిషికేశ్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఫలితం వచ్చింది.
 
ఆంధ్రాలో మరో 98 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 98 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 9370 శాంపిళ్లను పరిశీలించగా, ఇందులో 98 మందికి కరనా వైరస్ సోకినట్టు తేలింది. అలాగే, 24 గంటల్లో 43 మంది చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
కాగా, ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,042  అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 845 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 62కి చేరింది.
 
దేశంలో 24 గంటల్లో 8380 కేసులు 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో మరో 8380 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. 
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,82,143కి చేరగా, మృతుల సంఖ్య 5,164కి చేరుకుంది. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.
 
21 మంది కోలుకుంటున్నారు : లారెన్స్ 
అనాథ చిన్నారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారినపడిన మాట వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం వాళ్లంతా కోలుకుంటున్నారని చెప్పారు. 
 
చెన్నై అశోక్ నగరంలోని లారెన్స్ ట్రస్టులో వారం రోజుల క్రితం ట్రస్టులోని కొందరు చిన్నారుల్లో జ్వరంతోపాటు కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో వారికి వెంటనే పరీక్షలు చేయించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు.
 
కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ - టామ్ అండ్ జెర్రీ ఆట