Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైఫాయిడ్ జ్వరం వస్తే.. కరోనా అనుకుని.. ముగ్గురు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
శనివారం, 15 మే 2021 (19:10 IST)
కరోనా కాలంలో జ్వరం అంటేనే జనం జడుసుకుంటున్నారు. ఈ భయం ప్రాణాల్ని తీసేస్తోంది. అదే జరిగింది ఏపీలోని ఉత్తరాంధ్రా జిల్లా అయిన విజయనగరంలో. ఒకే కుటుంబంలో ముగ్గురికి జ్వరం వచ్చింది. అది టైఫాయిడ్ జ్వరం. కానీ అది కరోనా వల్లే వచ్చిందనే భయంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలోని వేపాడ మండలంలోని నల్లబిల్లిలో చోటుచేసుకుంది.
 
శుక్రవారం జరిగిన ఈ ఘటన నల్లబిల్లి గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. ఉడత సత్యనారాయణ గుప్తా అనే 62 వ్యక్తి రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గుప్తా భార్య 2002లో మరణించడంతో, 2009లో గుంటూరుకు చెందిన సత్యవతి వివాహం చేసుకున్నాడు. 
 
గుప్తాకు అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. గుప్తా కొడుకు తెలంగాణలోని నిజామామాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాడు. కూతురు వివాహం అయిపోయింది. ఓ పేపరు ప్రకటన చూసి గుంటూరుకు చెందిన సత్యవతిని గుప్తా రెండో వివాహం చేసుకున్నాడు.
 
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గుప్తా సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు. అలా గత రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారిని చూసుకునేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. కానీ కూతురికి కూడా జ్వరం వస్తుందనే భయంతో గుప్తా కూతురిని మీ ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పిన శుక్రవారం ఉదయం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు.
 
ఆ తరువాత తమకు వచ్చింది టైఫాయిడ్ జ్వరం కాదనీ.. కరోనా వల్ల వచ్చిన జర్వమే అనే భయంతో గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా గ్రామంలోని శివాలయం వెనకకు వెళ్లారు. కూడా తెచ్చుకున్న పురుగుల మందును ఓఆర్ఎస్‌లో కలిపి గుప్తా, భార్య, అత్త ముగ్గురూ తాగారు. 
 
ఆ తరువాత అక్కడే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments