ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:37 IST)
రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగింది. ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. పెద్దఎత్తున మాస్క్‌ల పంపిణీ వల్ల కరోనా నుంచి కొంత మేర రక్షణ లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేయాలన్న లక్ష్యంలో భాగంగా మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాల్సి ఉంటుందని సూచించారు.

మెడికల్‌ ఆఫిసర్స్‌ నిర్ధారించిన వారికే కాకుండా ఫీల్డ్‌లో గుర్తించిన అందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మధుమేహం, బిపి ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

నమోదవుతున్న కేసులు, వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

రైతుబజార్లు, మార్కెట్లలో సర్కిల్స్‌, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాలని, ఎక్కడా జనం గమికూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments