Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు కూలీలు మృతి, 20 మందికి పైగా గాయాలు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:22 IST)
గుంటూరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దర్మరణం చెందగా.. 20 మందికి పైగా కూలీలకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

మంగళవారం కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టంది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు కూలీలు మృతిచెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి.

మొత్తం మీద ఈ ఘటనలో 20 మందికిపైగా కూలీలకు గాయాలయ్యాయని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
కాగా.. బాధిత కూలీలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కర్నూలు నుంచి కూలీ పని కోసం వీరంతా గుంటూరు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు డ్రైవర్‌తోపాటు ఎర్నాల శ్రీనివాసులు, భీమయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments