Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి నదిలో మునిగిన పడవ.. ఇద్దరి మృతి.. 10 మంది సురక్షితం

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (09:40 IST)
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 12 మంది ఉన్నారు. 20 మంది పడవలో లంకకు వెళ్లారు. వారిలో 12 మంది తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తాపడింది. 
 
పడవలోకి నీరు చేరడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం (54), రాజు (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఊడెగోళం సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి (18) ప్రాణాలు కోల్పోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సమయంలో 35 మంది ఉండగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments