Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజు: మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:44 IST)
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్బ్రాంతిని  వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు.
 
బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తను ఎన్నో మధురమైన పాటలను అందించారని, నా విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఘంటశాల గారికి వారసుడిగా ఎవరొస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో బాలు గారు ధ్రువతారలా దూసుకొచ్చారని చిరంజీవి అన్నారు.
 
తన మధురమైన గానంతో భాష, సంస్కృతిల సరిహద్దులను చెరిపి వేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని తెలిపారు. బాలు గారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని తన మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని చెప్పారు. బాలు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరూలని మెగాస్టార్ ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments