Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత... ఎందుకని..?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (11:19 IST)
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. అడ్మిన్ బిల్డింగ్‌ను ఉక్కు కార్మికులు ముట్టడించారు. 
 
దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని.. వారు ఎందుకు వచ్చారు.. వారికి ఏమి చెప్పారో వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. 
 
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్వంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏమీ రాలేదని, స్టీల్ ప్లాంట్ ఇండిపెండెంట్ డైరక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని చెప్పారు. 
 
అయినా ఒప్పుకోని కార్మికులు పరిపాలనా భవనంలోనికి వెళ్లేందుకు కార్మిక నేతలు ప్రయత్నించగా పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments