Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత... ఎందుకని..?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (11:19 IST)
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. అడ్మిన్ బిల్డింగ్‌ను ఉక్కు కార్మికులు ముట్టడించారు. 
 
దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని.. వారు ఎందుకు వచ్చారు.. వారికి ఏమి చెప్పారో వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. 
 
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్వంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏమీ రాలేదని, స్టీల్ ప్లాంట్ ఇండిపెండెంట్ డైరక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని చెప్పారు. 
 
అయినా ఒప్పుకోని కార్మికులు పరిపాలనా భవనంలోనికి వెళ్లేందుకు కార్మిక నేతలు ప్రయత్నించగా పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments