Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా
, శనివారం, 29 జనవరి 2022 (17:36 IST)
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కార్మిక సంఘాలతో ఇవాళ‌ కార్మిక శాఖ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ప్లాంట్ యాజమాన్యం వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు
 
ఇక వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి స‌మ్మెకు వెళ్ల‌నున్న‌ట్టు మొద‌ట నోటీసులు ఇచ్చింది అఖిల‌ప‌క్షం. అయితే, ఆ త‌ర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి త‌ల‌పెట్టిన స‌మ్మెను వాయిదా వేస్తున్న‌ట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్ర‌క‌టించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో రోజుకి 30 వేల కోవిడ్ కేసులు: జనవరి 31 నుంచి నో కర్ఫ్యూ, ఎందుకంటే?